ట్రైనీ ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు

ట్రైనీ ఐపిఎస్ అధికారి మహేష్ రెడ్డి తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని భావన అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Update: 2019-10-30 11:52 GMT

ట్రైనీ ఐపిఎస్ అధికారి మహేష్ రెడ్డి తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని భావన అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాళ్లోకెలితే కడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ రెడ్డి ఏడాది క్రితం భావనను వివాహం చేసుకున్నాడని తెలిపింది. ఈ మధ్య పోలీస్ శాఖలో ఉద్యోగం రావడంతో మహేష్ ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తనకు మహేష్‌తో పరిచయం ఏర్పడిందని వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారని, ఒక సంవత్సరం పాటు కలిసి ఉన్నామని ఆమె తెలిపింది. అప్పటివరకు తనతో స‌ఖ్యంగా ఉన్న మహేష్ ఐపీఎస్ గా ఎంపికైనప్పటి నుండి చాలా మారిపోయాడని, కట్నం కోసం తపనతో రెండో వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె తెలిపారు. ఆయన కుటుంబాన్ని పోలీసులు రక్షిస్తున్నారని తనకి న్యాయం చేయాలని భావన పోలీసులను కోరారు. జవహర్‌నగర్ పోలీసులకు తాను 498 ఎ (వేధింపు), 323 మరియు 506 (క్రిమినల్ బెదిరింపు) మరియు ఎస్సీ & ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద ఫిర్యాదు చేశానని తనపై కేసు నమోదు చేయాలని ఆమె కోరారు.



Tags:    

Similar News