నేడు కొత్త కమిటీలు ప్రకటించనున్న పవన్ కళ్యాణ్

Update: 2019-06-24 02:21 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం లేకుండా, పార్టీలో పూర్తి స్థాయి కమిటీలు లేకుండానే నడిపించారు. జనసేన పార్టీ పెట్టి ఇన్నేళ్లయినా కమిటీలు బలంగా లేకపోవడంతో ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయింది. జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసే క్రమంలో పవన్ కొన్ని కొత్త కమిటీలను రూపొందించారు. రాజకీయ వ్యవహారాల కమిటీ, స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ, రాజధాని ప్రాంత అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ, వెనుకబడ్డ ప్రాంతాల పర్యవేక్షణ కమిటీ తో పాటు ఇతర కమిటీలు ఇందులో ఉంటాయని పార్టీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కొత్త కమిటీలను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నేటి మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారు. 

Tags:    

Similar News