జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర జరిగిన బోటు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోటు ప్రమాదంలో సుమారు 50 మంది గల్లంతయ్యారనే విషయం బాధ కలిగించిందన్న పవన్ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తక్షణం ఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు.
జనసేన నాయకులు, జనసైనికులు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టండి. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు. pic.twitter.com/6tpdwuqmSi
— JanaSena Party (@JanaSenaParty) September 15, 2019