జనసైనికులను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌

Update: 2020-01-14 10:35 GMT

జనసేన అధినేత పవన్ కాకినాడ చేరుకున్నారు. ఇటీవల కాకినాడలో జరిగిన దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ పరామర్శించారు. పవన్ తో పాటు భారీగా జనసేన కార్యకర్తలు కాకినాడకు చేరుకున్నారు. పవన్ కాన్వాయ్ లో కొన్ని వాహనాలను పోలీసులు మార్గం మధ్యలోనే నిలిపివేశారు. కాకినాడ చేరుకున్న పవన్ నేరుగా పంతం నానాజీ ఇంటికి వెళ్లారు. ఆదివారం జరిగిన దాడి ఘటనలో గాయపడిన జనసేన కార్యకర్తలను నానాజీ నివాసంలో పవన్‌ పరామర్శించారు. ఘటన జరిగిన తీరును జనసేన కార్యకర్తలు తమ అధినేతకు వివరించారు. దాడి ఘటన, ఆరోజు జరిగిన పరిణామాలపై తమ పార్టీ నేతలతో పవన్‌ చర్చిస్తున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడనున్నారు.

కాకినాడలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పవన్ పర్యటన సందర్భంగా కాకినాడలో భారీగా పోలీసులు మోహరించారు. అనధికార కర్ఫ్యూతో కాకినాడ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకు ముందు తుని చేరుకున్న పవన్ కు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం, పవన్ ర్యాలీగా బయలుదేరి కాకినాడ చేరుకున్నారు. 

Tags:    

Similar News