మంగళగిరి కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన పవన్ కళ్యాణ్
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనాలు సమర్పించారు.
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనాలు సమర్పించారు. జాతీయ జెండాకు సెల్యూట్ చేసి వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా చిన్నారితో కలిసి పవన్ కళ్యాణ్ ఆడుకున్నారు. జై భారత్ మాతా అంటూ నినాదాలు చేశారు.