మహిళా కండక్టర్ పై దాడి

Update: 2020-02-25 15:58 GMT
మహిళా కండక్టర్ పై దాడి

చిత్తూరు జిల్లాలో విధి నిర్వాహణలో ఉన్న మహిళా కండక్టర్ పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు. గుర్రంకొండ-తరికొండ మధ్య తిరిగే మధనపల్లి బస్ డిపోకు చెందిన బస్సులో ఘటన చోటు చేసుకుంది. టిక్కెట్టుకు సరిపడు చిల్లర ఇవ్వాలని అఢిగినందుకు కండక్టర్ ను రోడ్డుపై ఈడ్చికొట్టాడు. మహిళా కండక్టర్ పై అసభ్యకరంగా ప్రవర్తించిన బాల శివారెడ్డిని పోలీసులకు పట్టించి ఇచ్చారు తోటి ప్రయాణికులు. ప్రయాణికుడి చేతిలో గాయపడిన కండక్టర్ కన్నీటి పర్యంతం అయ్యారు. దాడికి గురైన మహిళ కండక్టర్ వాల్మీకిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వలంగా గాయపడిన మహిళా కండక్టర్‌కు ఆస్పత్రిలో చికిత్స అందించారు.

Tags:    

Similar News