Y V Subba Reddy: ‌శ్రీకాకుళం జిల్లా అభివృద్థే మా లక్ష్యం

Y V Subba Reddy: ‌సంక్షేమ పథకాలు అందిన ప్రతి ఇంటికి వెళ్లాలని దిశానిర్ధేశం

Update: 2024-04-13 02:52 GMT

Y V Subba Reddy: ‌శ్రీకాకుళం జిల్లా అభివృద్థే మా లక్ష్యం 

Y V Subba Reddy: ‌ఏపీలో ఎన్నికల వేళ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయని ... గతంలోనూ ఇలాగే వచ్చి ఏం సాధించాయంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన.. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను దిశానిర్ధేశం చేశారు. సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతీ కుటుంబం ఇంటికి వెళ్లి ఓటు అడగాలని సూచించారు. ప్రతిపక్షాలు విమర్శలను తిప్పికొడుతూనే.. జగన్ ప్రభుత్వం చేసిన మేలును గుర్తు చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేశామని.. మరో 700 కోట్లతో.. ఉద్దానం త్రాగునీటి ప్రాజెక్ట్, కిడ్నీ రిసెర్చ్ సెంటర్ 4 వేల కోట్లతో మూలపేట పోర్టును నిర్మిస్తున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News