ఏపీలో వార్డు వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టణాల్లో వార్డు వాలంటీర్ల నియమానికి ప్రభుత్వ కార్యదర్శి శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పట్టణాల్లో ప్రతి వంద ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వార్డు వాలంటీర్కు డిగ్రీ విద్యార్హతగా నిర్ణయించింది. వార్డు వాలంటీర్ పనితీరు ఆధారితంగా నెలకు 5వేల గౌరవ వేతనం ఇస్తారు. ఆగస్టు 15న పట్టణాల్లో వార్డు వాలంటీర్ల సేవలు ప్రారంభం కానున్నాయి.