ఆంధ్రప్రదేశ్కు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఊహించని షాకిచ్చింది. రాష్ట్రంలో పర్యావరణ అనుమతుల్లేని ప్రాజెక్టులు నిలిపివేయాలని ఆదేశించింది. ఎత్తిపోతల పథకాలతో పర్యావరణం దెబ్బతింటోందంటూ మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ ఎన్జీటీని ఆశ్రయించడంతో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఈ ఆదేశాలు ఇఛ్చింది. గోదావరి-పెన్నా, పట్టిసీమ, చింతలపూడి, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే కట్టాలని ఏపీకి సూచించింది.