ఏపీ సీఎం జగన్పై నారా లోకేశ్ విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సీఎం జగన్ పై పాటు విజయసాయి రెడ్డిపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కలికాలం కాకపోతే అక్రమాల విక్రమార్కులు నీతి నిజాయితీ గురించి మాట్లాడటమా అని ట్వీట్ చేశారు మాజీ మంత్రి నారా లోకేష్. వైఎస్ హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్ 14 రూపాయలకు కొంటే, టీడీపీ హయాంలో 2 రూపాయల 70 పైసలకు యూనిట్ కొన్నారని తెలిపారు. వైఎస్సార్ వల్ల డిస్కంలకు 8 వేల కోట్ల నష్టం వచ్చిందని ట్వీట్ చేశారు. ఈ ఉదాహరణలు చాలావా అన్ని ప్రశ్నించారు లోకేష్.గుడ్డ కాల్చి వెయ్యడంలో మీకు మీరే సాటి జగన్ గారు అని వ్యాఖ్యానించారు.