అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేసిన అధికార పక్షం.. కనీసం తమ వాదన వినేందుకు కూడా ఇష్ట పడటం లేదన్నారు. టీడీపీ శ్రేణులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆరోపించారు . అసలు సభను నడిపించేది స్పీకరా? లేదా సీఎం? అంటూ పార్టీ శ్రేణలతో పెద్ద ఎత్తున ప్రకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని అసెంబ్లీ ఆవరణ నుండి శాసనసభ వరకు నినాదాలతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో చంద్రబాబు నాయుడి వెంట నారా లోకేశ్, టీడీపీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కాలినడకన శాసనసభకు వెళ్లారు.