జగన్ ను అందుకే కలిశా.. అక్కినేని నాగార్జున

Update: 2019-02-19 13:50 GMT

సినీ హీరో అక్కినేని నాగార్జున వైసీపీ అధినేత వైయస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వివిధ కథనాలు వచ్చేశాయి. అయితే ఈ కథనాలకు నాగార్జున వివరణ ఇచ్చారు. తాను జగన్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని.. చాలా ఏళ్లుగా వైయస్ కుటుంబంతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. జగన్ పాదయాత్ర ఇటీవల ముగిసింది. అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం మామూలు విషయం కాదు. అది సక్సెస్ అవ్వడంతో జగన్ ను కలిసి అభినదించానని నాగార్జున చెప్పారు. తాను రాజకీయాల్లోకి రానని.. ఎవరి సీటుకోసమో రికమెండ్ చెయ్యాల్సిన అవసరం తనకు లేదని నాగార్జున వెల్లడించారు.
 

 

Similar News