సినీ హీరో అక్కినేని నాగార్జున వైసీపీ అధినేత వైయస్ జగన్ తో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లోని జగన్ ఇంటికి వెళ్లిన నాగార్జున.. జగన్ తో తాజా రాజకీయాలపై చర్చించారు. తన భార్య అమల లేదా తన సన్నిహితుడికి గుంటూరు ఎంపి టికెట్ కోసం నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. కాగా నాగార్జునకు వైఎస్ జగన్ కు స్వయంగా స్వాగతం పలికినట్టు సమాచారం. కొంతకాలంగా నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. పాదయాత్ర అనంతరం వైఎస్ జగన్ చేపట్టబోయే బస్సు యాత్రలో నాగార్జున కూడా పాల్గొంటారంటూ కూడా వార్తలు వినిపించాయి.