ఎమ్మెస్వోలను, ఆపరేటర్లను కృష్ణా జిల్లా జేసీ విజయకృష్ణన్ పరుష పదజాలంతో దూషించడమే కాకుండా జైల్లో పెట్టమని, కేబుల్ వైర్లు కత్తిరించమని కిందిస్థాయి అధికారులను ఒత్తిడి చేస్తున్నారని ఏపీ మల్టీ సిస్టం ఆపరేటర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆరోపించింది. ఇందుకు నిరసనగా ఇవాళ ఉదయం 8 నుంచి 9 గంటలవరకు గంటపాటు రాష్ట్రవ్యాప్తంగా టీవీ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.