ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్రానికి కొన్ని విన్నపాలు చేశారు. రానున్న బడ్జెట్లో ఏపీకి కేటాయింపుల విషయంలో కేంద్రానికి కొన్నివిజ్నప్తులు చేశారు. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టం, ఏపీకి రావలసిన నిధుల గురించి కేంద్రానికి వివరించామని బుగ్గన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు బుగ్గన తెలిపారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సల్ సమావేశానికి హాజరైన బుగ్గన పలు కీలక విషయాలపై కేంద్రానికి తమకు కేటాయించాల్సిన ఆవశ్యకతను వివరించారు. మూడు వారాల్లోగా సమతౌల్యమైన బడ్జెట్ను మీరు చూస్తారు. అవినీతి రహిత పరిపాలనే మా ధ్యేయం. చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నాం' అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.