Botsa Satyanarayana: మావోయిస్ట్ పార్టీకి టీడీపీకి తేడా లేదు

*టీడీపీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతాం- బొత్స *చంద్రబాబుకు పవన్ వత్తాసు పలుకుతున్నారు : మంత్రి బొత్స

Update: 2021-10-20 07:15 GMT

బొత్స సత్యనారాయణ (ఫైల్ ఫోటో)

Botsa Satyanarayana: మావోయిస్టు పార్టీకి, టీడీపీకి తేడాలేదని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శాంతి భద్రతలను అల్లకల్లోలం చేస్తున్న తెలుగుదేశం పార్టీని నిషేధించాలని ఎలక్షన్ కమిషన్‌ని కోరుతామన్నారు. ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి భాష వాడుతారా అని ప్రశ్నించారు. అలాంటి వారిని చంద్రబాబు సమర్ధించడం దారుణమన్నారు. ఎన్నో ఏళ్లుగా తాము రాజకీయాల్లో ఉన్నా అలాంటి భాషని ఎవరూ మాట్లాడలేదని, చంద్రబాబు నీచమైన రాజకీయాలకు పవన్ కల్యాణ్ వత్తాసు పలకుతున్నాడని బొత్స దుయ్యబట్టారు.

Tags:    

Similar News