జగన్‌ ఇచ్చిన వాగ్ధానాలను నూటికి నూరు శాతం నెరవేర్చారు : బొత్స

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నూటికి నూరు శాతం సీఎం జగన్‌ నెరవేర్చారని అన్నారు మంత్రి బొత్స. ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా గరివిడి నుంచి చీపురుపల్లి వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు

Update: 2020-11-15 16:15 GMT

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నూటికి నూరు శాతం సీఎం జగన్‌ నెరవేర్చారని అన్నారు మంత్రి బొత్స. ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా గరివిడి నుంచి చీపురుపల్లి వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. మేనిఫెస్టోను సీఎం జగన్‌.. భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తారని బొత్స స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో 129 హామీలిస్తే.. దానికి మరో 40 వాగ్ధానాలను జోడించి నెరవేర్చిన ఏకైక సీఎం జగన్‌ అని అన్నారు మంత్రి బొత్స. నాడు అధికారంలో ఉన్న టీడీపీ.. ప్రజల అవసరాలను గుర్తించలేకపోయిందని.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోలేకపోయిందని విమర్శించారు బొత్స.

Similar News