బొత్స వ్యాఖ్యలపై రైతులు ఆవేదన

రాజధాని వ్యవహారంలో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబును గుంటూరులోని ఎన్టీఆర్ భవన్‌లో నీరుకొండ గ్రామ రైతులు కలిసి ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2019-08-27 00:45 GMT

 రాజధాని వ్యవహారంలో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబును గుంటూరులోని ఎన్టీఆర్ భవన్‌లో నీరుకొండ గ్రామ రైతులు కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులకు ఇంతవరకూ ప్రభుత్వం కౌలు చెల్లించలేదని చెప్పారు. కౌలు చెల్లించకుండా మా భూముల్లో కట్టిన సెక్రటేరియట్‌లో మంత్రులు ఎలా కూర్చొంటారని రైతులు ప్రశ్నించారు. అమరావతిలో అవినీతి అంటూ ప్రభుత్వం అసత్యాలు పలుకుతోందని, రాజధానిలో నిర్మాణాలన్నీ ప్రభుత్వం నిలిపివేసిందని చంద్రబాబుకు వివరించారు. రాజధాని రైతులకు అండగా మీరు అండగా ఉండాలని చంద్రబాబును కోరారు. వారి నుద్దేశించిన మాట్లాడిన చంద్రబాబు వారికి భరోసా కల్పించారు. 

Tags:    

Similar News