హైస్కూళ్లలో తనిఖీ చేసిన మంత్రి అనిల్‌..

Update: 2019-07-07 11:55 GMT

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఒక్కరోజు పర్యటన నిమిత్తం నెల్లూరులో పర్యటించారు. జిల్లా కేంద్రంలో పలు నీటిపారుదల కాలువలు, డ్రైన్లు, పలు స్కూళ్లను ఆయన సందర్శించారు. మున్సిపల్ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో అతిపెద్ద పాఠశాలలుగా ఉన్న ఆర్‌ఎస్సార్, బివిఎస్ హై స్కూల్, కెఎన్నార్ సహా పలు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు పరిశీలించారు. నెల్లూరులో ఉన్న కార్పొరేషన్ స్కూల్స్‌ అన్నిటి రూపు రేఖల్ని మారుస్తామన్నారు. ఆగస్టు రెండో వారం నుంచి పనులని మొదలుపెట్టాలని కార్పొరేషన్ అధికారులకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశించారు. తనిఖీల్లో భాగంగా టీడీపీ హయాంలోని తుప్పు పట్టిన సైకిళ్లు బయటపడ్డాయి. గత ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో పిల్లలకు ఇవ్వకుండా నిలిపి వేసిన టీడీపీ సైకిళ్లను మంత్రి అనిల్‌ కుమార్‌ పరిశీలించారు. 

Tags:    

Similar News