వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి పార్టీని వీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను పార్టీని వీడుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాను వైసీపీకి రాజీనామా చెయ్యాల్సిన పరిస్థితి రాలేదని చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడిన రాజమోహన్ రెడ్డి.. వైఎస్సార్సీపీ ఆవిర్భావానికి ముందు నుంచి వైఎస్ జగన్తో కలిసి పనిచేస్తున్నానని.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీచేస్తానని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ఎంపీ పదవికి రాజీనామా చేశాను అని చెప్పారు.