రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ సమావేశం విజయవాడ గేట్వే హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంటకీ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నామా నాగేశ్వరరావు, కేశినేని నానితో పాటు మొత్తం 11 మంది ఎంపీలు హాజరయ్యారు.పసుపు, సుగంధ ద్రవ్యాలు, వ్యవసాయ, సీఫుడ్ ఉత్పత్తుల ఎగుమతిదారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ వ్యవసాయ మిషన్ ఛైర్మన్ నాగిరెడ్డి కూడా హాజరయ్యారు.