విశాఖలో విషాదం.. మద్యం అనుకుని విషాన్ని సేవించి..

Update: 2019-02-24 13:21 GMT

విశాఖ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని డబ్బాలోని ద్రావణాన్ని మద్యంగా భావించి తాగడంతో.. అది విశమైంది. దాంతో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను విశాఖలోని కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Similar News