కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని వణికిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమలో మూగజీవాలను లంపి స్కిన్ వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. అమలాపురం, అల్లవరం, అంబాజీపేట, అయినవిల్లి, ముమ్మిడివరం... ఇలా పలు ప్రాంతాల్లో ఈ వైరస్ సోకింది. ప్రధానంగా ఆవులకు ఈ వైరస్ సోకడంతో మృత్యువాతపడుతున్నాయి. ఈ వైరస్కు ఎలాంటి మందు లేదని.. పశు వైద్యాధికారులు చెబుతున్నారు. అమలాపురంలోని గోశాలలో ఈ వైరస్ బారిన పడి ఇవాళ రెండు ఆవులు మృతి చెందాయి.