జగన్ సీఎం కావడం ఖాయం : రోజా

Update: 2019-05-22 05:27 GMT

 రాష్ట్రానికి జగన్ సీఎం కావడం ఖాయమన్నారు వైసీపీ నేత రోజా. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రప్రజలు , వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె  చెప్పారు. చంద్రబాబు వల్ల రాష్ట్రం పరువు పోయిందని, అభివృద్ధిలో వెనుకబడిపోయామని చెప్పారు. . నగరి నియోజకవర్గం నుంచి తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రోజా ధీమా వ్యక్తం చేశారు. లగడపాటిది స్వార్థపూరిత సర్వే అని, నిష్పక్షపాతంగా చేసింది కాదని అన్నారు.ఈ విషయం తమిళనాడు, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తేలిందన్నారు. లగడపాటి సర్వేను ప్రజలు నమ్మడం లేదన్నారు. త్వరలోనే వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తారని ధీమా వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను నమ్ముకున్న టీడీపీకి రేపటి ఫలితాలు సరైన గుణపాఠం చెబుతాయని చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్ర మహిళలను అప్పులపాలు చేయడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కించారని విమర్శించారు.


Similar News