ఏపీ భవన్‌లో సీఎం జగన్‌తో కర్ణాటక సీఎం కుమార స్వామి భేటీ

Update: 2019-06-15 08:22 GMT

ఏపి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే .. ఢిల్లీ లోని ఏపీ భవన్‌లో సీఎం జగన్‌తో కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారుస్వామిని జగన్ విందుకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎంల మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది.ఈ కార్యక్రమంలో వైసీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, ఈ భేటీలో ఏపీ, కర్ణాటకకు లబ్ధి చేకూర్చే అంశాలపై ఇరువురు నేతలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని వైసీపీ వర్గాలు చెప్పాయి. ఈ విషయంలో ఇరురాష్ట్రాల సీఎంలు కలసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారని పేర్కొన్నాయి.

Tags:    

Similar News