కాపు జాతి మొత్తం వైసీపీకే ఓటేసింది:ముద్రగడ

Update: 2019-07-09 06:26 GMT

మొన్నటి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీని కాదని మరీ వైసీపీకి కాపులంతా ఓటేశారని కాపు నేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పై ఉందని ఆ లేఖలో తెలిపారు. చంద్రబాబు వదిలివేసిన 5 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని అయన ఆ లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.  

Tags:    

Similar News