కేఏ పాల్ గోల్డ్ చైన్ నొక్కేశారు..

Update: 2019-03-28 05:44 GMT

కేఏ పాల్.. ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. మత ప్రభోధకుడిగా ఉంటూ దేశ విదేశాలు తిరిగొచ్చిన ఆయన.. ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ నెలకొల్పి ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ.. తానే ఏపీకి కాబోయే మ్నుఖ్యమంత్రిని అంటూ పాల్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు అనుకోని సంఘటన ఎదురైంది. ఆయన గోల్డ్ చైన్ ఎవరో నొక్కేశారు. ప్రచారంలో భాగంగా ప్రజాశాంతి పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్న తరుణంలో ఆయన వేసుకున్న దండలు తీసే ముసుగులో ఆయన చైన్ కూడా నొక్కేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కేఏ పాల్ దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. 

Similar News