బిగ్ బ్రేకింగ్ : రాజధానిని అమరావతిలోని కొనసాగించాలి : జనసేన

Update: 2019-12-30 10:45 GMT

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. సమావేశంలో అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాజధానిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చి వారిని ఆదుకోవాలని తీర్మానించారు. అంతేకాదు కర్నూల్ లో హైకోర్టును ఏర్పాటు చెయ్యడానికి సాధ్యపడదని.. కావాలంటే బెంచ్ ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వానికి సూచించారు. ఒకవేళ అమరావతి నుంచి బలవంతంగా రాజధానిని తరలించాలని చూస్తే రైతుల తరుపున పోరాటం చెయ్యాలని విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

అంతేకాదు ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించే వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని పార్టీ నేతలకు పవన్ సూచించారు. రాజధాని విషయంలో ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, పార్టీ నేతలందరికీ ఏకాభిప్రాయం అవసరమని అన్నారు. జిల్లా వారీగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని పార్టీ నాయకులకు సూచించారు. సుదీర్ఘ విరామం తరువాత, పవన్ మూడు రాజధానులపై తన తాజా వ్యాఖ్యలతో వెలుగులోకి వచ్చారు.

Tags:    

Similar News