రేపు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న పవన్

రేపు అమరావతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.

Update: 2020-02-14 14:04 GMT

రేపు అమరావతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న పవన్.. రాజధాని తరలింపుపై దీక్ష చేస్తున్న రైతులకు మద్దతు తెలపనున్నారు. మంగళగిరి జనసేన పార్టీ ఆపీసు నుంచి బయలుదేరనున్న జనసేనాని.. యర్రబాలెం, పెనుమక, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు పర్యటిస్తారు. ఈ పర్యటనలో దీక్ష చేస్తున్న వారితో పాటు రాజదాని రైతులకు పవన్ సంఘీభావం తెలపనున్నారు.


Full View


Tags:    

Similar News