జనసేన, బీజేపీ సంయుక్తంగా భరోసా యాత్ర
జనసేన, బీజేపీ సంయుక్తంగా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతూ రెండు పార్టీల నాయకులు భరోసా యాత్ర కొనసాగిస్తున్నారు.
జనసేన, బీజేపీ సంయుక్తంగా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతూ రెండు పార్టీల నాయకులు భరోసా యాత్ర కొనసాగిస్తున్నారు. జనసేన, బీజేపీల నుంచి చెరో ఆరుగురు నేతల చొప్పున బృందంగా ఏర్పడ్డారు. మందడం, వెలగపూడి, తుళ్లాూరు గ్రామాల్లో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
అసెంబ్లీలో రాజధాని బిల్లు వచ్చిన రోజున అమరావతి ఏరియాలో పర్యిటించేందుకు పవన్ కల్యాణ్ రెడీ అవగా.. పోలీసులు ఆయన్ను అడ్డుకున్న సంగతి తెలసిందే. ఆ తర్వాత బీజేపీతో కుదిరిన కొత్త స్నేహంతో రాజధాని ఆందోళనకు ఇరు పార్టీలు సంసిద్దమయ్యాయి. ఈలోగా రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ఖరారుపై ఇరుపార్టీల నేతలు కలిసి పలు దఫాలుగా భేటీ అయ్యారు.
రెండు పార్టీల నుంచి చెరో ఆరుగురు నేతల చొప్పున బృందంగా ఏర్పడి అమరావతి ఏరియాలోని గ్రామాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేశారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో మిత్ర పక్షాల బృందం పర్యటించబోతోందని తెలిపారు. ఏక నిర్ణయంతో ముందుకు పోతామంటుని అందులో భాగమే ఈ రాజధాని పర్యటన అని బీజేపీ-జనసేన వర్గాలంటున్నాయి.
2-2-2020, ఆదివారం జనసేన, బీజేపీ పార్టీలు సంయుక్తంగా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తాయి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కలుసుకొని వారికి భరోసానిస్తాయి. ఉదయం 9 గం.కు హాయ్ ల్యాండ్ లో ఇరు పార్టీల నాయకులు సమావేశమవుతారు. అనంతరం 10గం.కు మందడం, వెలగపూడి, తుళ్ళూరు గ్రామాల్లో పర్యటిస్తారు.
— JanaSena Party (@JanaSenaParty) February 1, 2020