కాకినాడలో జనసేనాని టూర్‌ టెన్షన్‌.. వైసీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

Update: 2020-01-14 06:53 GMT
కాకినాడలో జనసేనాని టూర్‌ టెన్షన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో కాకినాడలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇప్పటికే నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన జనసేన నాయకులు, కార్యకర్తలను పరామర్శించేందుకు పవన్ కాకినాడ చేరుకోబోతున్నారు. ఢిల్లీ నుంచి విశాఖకు, విశాఖ నుంచి కాకినాడకు వెళ్లనున్నారు.

గాయపడిన కార్యకర్తలను పరామర్శించాక జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని పలు ప్రధాన కేంద్రాల్లో పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ద్వారంపూడి నివాసానికి 100 మీటర్ల దూరంలో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News