ఇటివల ముగిసిన ఏపీ సార్వత్రిక ఎన్నికల పరాజయం తరువాత పార్టీని సంస్థాగతంగా బలపరచడానికి అడుగులు వేస్తున్నారు పవన్ జనసేనాని. ఇప్పటికే పార్టీకి సంబంధించిన పలు కీలక కమిటీలను కూడ ప్రకటించారు. తర్వాత ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పొలిటికల్గా మళ్లీ యాక్టివైన జనసేనాని పవన్ కల్యాణ్... ఏదో ఒక అంశంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. అక్టోబర్ నుంచి కొత్త ఆట మొదలుపెడతామన్న పవన్ కళ్యాణ్, ఈనెల 4న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల మరణించిన జనసేన కార్యకర్త కుటుంబాన్ని పవన్ పరామర్శించనున్నారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయనున్నారు.