332వ రోజు జగన్ పాదయాత్ర ప్రారంభం

Update: 2018-12-29 04:16 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రాస్తుతం శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. శనివారం 332వ రోజు పాదయాత్ర తూముకొండ నుంచి ప్రారంభమైంది. హేరాపురం, పెద్దపూడి, చీపురుపల్లి మీదుగా పాదయాత్ర సాగనుంది. ప్రస్తుతం పాదయాత్ర పాతపట్నం నియోజకవర్గంలో జరుగుతోంది. పాదయాత్ర ఏర్పాట్లను పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, టెక్కలి ఇంచార్జ్ దువ్వాడ, సీనియర్ నేతలు, కార్యకర్తలు యాత్రలో పాల్గొంటున్నారు. 

Similar News