బీజేపీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత వైయస్ జగన్ ల మధ్య రహస్య పొత్తు ఉన్నట్టు కొంతకాలంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై జగన్ స్వయంగా స్పందించారు. ప్రస్తుతానికి తాము ఎవ్వరితో పొత్తు పెట్టుకోలేదని.. ప్రత్యేక హోదాయే తమకు ముఖ్యమని.. ఎవరు సంతకం పెడితే వారికే మా మద్దతుఉంటుందని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తమకు ఎటువంటి రహస్య ఒప్పందం లేదు. ఆయనకు కావాలని ఒకే ఒక్కసారి ఫోన్ చేశాను. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓడించినందుకు కంగ్రాట్యులేషన్స్ చెప్పానని జగన్ అన్నారు.