జాతీయ జెండాను ఎగరవేసిన సీఎం జగన్

దేశవ్యాప్తంగా ఘనంగా 73వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. నేడు 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరవేశారు.

Update: 2019-08-15 03:47 GMT

దేశవ్యాప్తంగా ఘనంగా 73వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. నేడు 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఆ తరువాత రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News