తండ్రి సమాధి చెంత భావోద్వేగంలో జగన్

Update: 2019-05-29 10:22 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇడుపులపాయ లోని తన తండ్రి, దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆయనకు ఘానా నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆనందం కంటే తన తండ్రి లేరనే బాధ ఆయనలో కనిపించింది. మోకాళ్లపై  తన తండ్రి సమాధి వద్ద కొన్ని నిమిషాల పాటు మౌనంగా కూచుని ప్రార్థనలు చేశారు జగన్. 

అంతకు ముందు పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. అనంతరం ఇడుపులపాయ చేరుకొని తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. సాయంతరం ఇక్కడా నుంచి బయలు దేరి కడప మీదుగా అమరావతి చేరుకుంటారు. విజయవాడలో ఈ సాయంత్రం దుర్గ గుడిని ఆయన సందర్శిస్తారు. 


Similar News