పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం
* అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు వేసిన గుర్తు తెలియని వ్యక్తులు * రెచ్చగొట్టి గొడవలు పెట్టాలని చూస్తున్నారని.. * వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసి అవమానించారు. ఈ అవమానం కే కాదని. దేశ ప్రజలందరికీ జరిగినట్లేనన్నారు స్థానికులు. కుల, మతాలను రెచ్చగొట్టి గొడవలు జరపాలని చూస్తున్నారన్నారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.