ఏపీలో గత ఐదేళ్ల కాలంలో విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. ట్రాన్స్కో సీఎండీ కన్వీనర్గా 9 మందితో కూడిన కమిటీ ఏర్పాటైంది. కమిటీలో సభ్యులుగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, బాలినేని, అడ్వకేట్ జనరల్, అజేయకల్లం, రావత్, ఇంధన శాఖ కార్యదర్శి ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా సోలార్, విండ్ పవర్ ధరలపై రివ్యూ నిర్వహించి.. తక్కువ ధరకు దొరికితే సంప్రదింపులు చేయనుంది.