నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటన మరవక ముందే మచిలీపట్నంలో మరో కలకలం

కృష్ణా జిల్లాలో నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటన మరవక ముందే.. అలాంటిదే మరో ఘటన.. తీవ్ర సంచలనం రేపుతోంది.

Update: 2020-02-23 05:30 GMT

కృష్ణా జిల్లాలో నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటన మరవక ముందే.. అలాంటిదే మరో ఘటన.. తీవ్ర సంచలనం రేపుతోంది. మచిలీపట్నం బచ్చుపేటలోని సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహంలోని విద్యార్థినుల రూముల్లోకి కొందరు యువకులు చొరబడ్డారు. దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 10 మంది యువకులు బాలికల వసతి గృహంలో ఏకంగా 4 గంటల పాటు గడిపారు. అయితే యువకులు వచ్చిన సమయంలో.. వార్డెన్ హాస్టల్ లో లేరని తెలుస్తోంది.

ఓ యువకుడి పుట్టిన రోజు కావడంతో.. విద్యార్థినులకు ఆ యువకులు బిర్యానీ వండి పెట్టినట్లు చెబుతున్నారు. రాత్రి 7 గంటలా 30 నిమిషాల వరకు విద్యార్థినులతోనే యువకులు ఉన్నట్లు చెబుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న టీడీపీ, వైసీపీ, మహిళా సంఘాల నాయకులు.. హాస్టల్‌కు దగ్గరకు వచ్చి నిరసన చేపట్టారు. విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.


Full View


Tags:    

Similar News