శాసనసభ లో ప్రసంగిస్తున్న గవర్నర్

Update: 2019-06-14 03:46 GMT

మూడో రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. శాసనసభ నుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కొత్త ప్రభుత్వ హయాంలో నూతన పథకాలతో పాలన సాగుతుందని చెప్పారు. విభజన హామీలు నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని గవర్నర్ తమ ప్రసంగంలో పేర్కొన్నారు. టెండర్ల పై జ్యుడిషియల్ కమిటీ వేస్తామని ప్రకటించారు. 

Tags:    

Similar News