ఇటీవల వైసీపీలో చేరిన మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ కు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను హిందూపురం పార్లమెంట్ ఇంచార్జ్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీసు శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ఇటీవలే వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కదిరి సీఐగా పనిచేసే సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు
చేశారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు మాధవ్. ఆ సమయంలో జేసీపై మీసం మెలేసి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే . తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ వివాద నేపథ్యంలో జేసీ.. పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన గోరంట్ల మాధవ్.. నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు.