సీఎం జగన్కు గంటా శ్రీనివాసరావు బహిరంగ లేఖ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బహిరంగ లేఖ లేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బహిరంగ లేఖ లేశారు. లేఖలో విశాఖ భూ కుంభకోణం నివేదికను బయటపెట్టాలని, సిట్ విచారణ ను పునః ప్రారంభించాలని, విశాఖపట్నం భూ కుంభకోణం కేసులో మళ్లీ దర్యాప్తు జరిపించాలని సీఎంను కోరారు. ఇక ఈ కేసు విషయంలో చాలా మంది వైసీపీ నేతలు సిట్ దర్యాప్తు కోరుకుంటున్నారని, ఇక వారి డిమాండ్ను తానుస్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక తాను మంత్రిగా ఉన్న సమయంలోనే సిట్ నివేదికను బయటపెట్టాలని కోరానని, అయినా బయట పెట్టి లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు నివేదికలోని అంశాలను బయటపెట్టాలని గంటా డిమాండ్ చేశారు. ఇక అలాగే జగన్ వంద రోజుల పాలనకు శుభాకాంక్షలు తెలిపారు.