పార్టీ మారే ప్రసక్తే లేదు: గంటా శ్రీనివాసరావు

Update: 2019-06-25 09:06 GMT

గత కొన్నిరోజులుగా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతుండడం తెలిసిందే. అయితే మరికొందరు నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. అందులో ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా కమలం గూటికి చేరుతరంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై గంటా శ్రీనివాసరావు స్వయంగా వివరణ ఇచ్చారు. తాను తెలుగుదేశం పార్టీ మారతానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని గంటా స్పష్టం చేశారు. కాగా మీడియాలో తన గురించి వినిపిస్తున్న వార్తలు అసత్యలని ఆ కథనాల పట్ల పెద్దగా స్పందించాల్సిన అవసరమే లేదని ట్వీట్ చేశారు. గడిచిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ఎన్నికల ముందు కూడా ఇలాంటి వార్తలు వచ్చాయని, ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఇలాంటి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు అలాంటి అసత్య కథనాలు వస్తూనే ఉంటాయని అన్నారు. అసలు తాను పార్టీ మారాల్సిన అవసరం లేదని, జై టీడీపీ అంటూ ట్విట్టర్ ద్వారా పెర్కోన్నారు.  

Tags:    

Similar News