ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చిన వైసీపీ ఓట‌మి ఖాయం

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత‌, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2020-04-15 15:59 GMT
Rayapati sambasiva rao (file photo)

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత‌, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయంలోనూ జగన్ ప్రభుత్వం ఒక సామాజిక వ‌ర్గాన్ని లాగుతోందని, అదే సమయంలో అన్ని కాంట్రాక్టులు ప్ర‌బుత్వ పోస్టులు రెడ్డి సామాజిక వర్గం వారికే అందిస్తోందని ఆరోపించారు. త‌మ‌ సామాజికవర్గం వారు కనిపిస్తే పక్కన పెడుతున్నార‌ని ఆరోపించారు.

త‌మ సామాజిక వ‌ర్గం ఏం చేస్తారులే అని అనుకోవద్దని, అంద‌రూ ఓట్లు వేస్తేనే జ‌గ‌న్ సీఎం అయ్యార‌ని, త‌మ సామాజిక వ‌ర్గం క‌లిస్తే జ‌గ‌న్ పిఠం క‌దులుతుంద‌ని రాయపాటి హెచ్చరించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయకపోతే రాష్ట్రంలో ప్రాణ న‌ష్టం జ‌రిగేద‌ని రాయపాటి అన్నారు. ఎన్నికలను వాయిదా వేశారన్న కారణంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను క‌క్ష్య పూరితంగా తొలగించడం సరికాదని రాయపాటి ఆరోపించారు.

ఇక రాజధాని మార్పుపైజ‌గ‌న్ స‌ర్కార్ మైలేజ్ జీరో అవుతుందని రాయపాటి అభిప్రాయపడ్డారు. కరోనా స‌మ‌స్య త‌గ్గిన త‌ర్వాత‌ అమరావతి అంశంపై ప్రధానితో చ‌ర్చిస్తామ‌ని రాయపాటి చెప్పారు. కరోనా వైరస్‌ను సీఎం జగన్ త‌క్కువ స్థాయిలో అంచ‌నా వేశార‌ని రాయపాటి ఆరోపించారు. క‌రోనాపై త‌క్క‌వ అంచ‌నా వేశార‌ని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫానే క్వారంటైన్‌లో ప‌రిస్థితి వ‌చ్చింద‌ని రాయ‌పాటి పేర్కొన్నారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చిన వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని జోస్యం చెప్పారు. 


Tags:    

Similar News