రాజమండ్రి దగ్గర వరద గోదావరి శాంతించింది. ధవలేశ్వరం బ్యారేజ్ వరదనీరు నిలకడగా ఉంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 12 పాయింట్ 20 అడుగులకు చేరుకుంది. దీంతో బ్యారేజ్ నుంచి 175 గేట్ల ద్వారా 10లక్షల 51 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ఎగువ పరివాహాక ప్రాంతంలో వరద కాస్తంత తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ముంపు, లంకగ్రామాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముంపుబాధితులను ఎప్పటికప్పుడు అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు తాగేందుకు చుక్కనీరు వరదబాధితులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.