సీఎం జగన్ను కలిసిన మత్స్యకారులు
-క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న మత్స్యకారులు -కృతజ్ఞతలు తెలుపనున్న మత్స్యకారులు -మత్స్యకారులకు రూ.5లక్షల చెక్కును అందజేయనున్న ప్రభుత్వం
పాక్ చెర నుంచి విడుదలైన ఉత్తరాంధ్ర మత్స్యకారులు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. పాక్ చెర నుంచి వారిని విడిపించినందుకు సీఎం జగన్కు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు.
బతికినంత కాలం రుణపడి ఉంటామని సీఎం జగన్కు తెలిపారు మత్స్యకారులు. అయితే పాక్ జైల్లో ఉండి ఉపాధి కోల్పోయిన కారణంగా.. ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల చెక్కును మత్స్యకారులకు సీఎం జగన్ అందజేశారు.కార్యక్రమంలో మంత్రి మోపిదేవి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు.