తప్పిన ప్రమాదం : 25 మంది విద్యార్థులున్న పాఠశాల బస్సు దగ్ధం..

పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.. దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి పాఠశాలకు చెందిన బస్సు

Update: 2019-12-13 15:15 GMT
School bus

పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.. దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి పాఠశాలకు చెందిన బస్సు 25 మంది విద్యార్థులతో కలిసి చాగల్లు బయల్దేరింది. ఈ క్రమంలో బస్సు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. దీనితో వెంటనే అప్రమత్తం అయిన బస్సు డ్రైవర్ బస్సును రోడ్డుపైన ఆపేసి హుటాహుటిన విద్యార్దులను బస్సు నుంచి కిందికి దించాడు. ఈ ప్రమాదంలో పాఠశాలకి సంబంధించిన బస్సు దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ జరగలేదు.

ఈ ఘటన మీనానగరం వద్ద జరిగింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని సంప్రదించగా వారు వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటల్లోనే బస్సు పూర్తిగా కాలిపోయంది . షాట్ సర్క్యూట్ వలెనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను తెలుసుకున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Tags:    

Similar News