జగన్ ప్రధాని అయినా.. ఏపీకి ప్రత్యేక హోదా రాదు: బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2019-07-15 03:35 GMT

ప్రస్తుతం ఏపీ సీఎంగా యంగ్ అండ్ ఎనర్జీటిక్ గా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, లేదా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశానికి ప్రధానమంత్రి అయినా సరే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేరని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టుదలకి పోకుండా ప్యాకేజ్‌ని సాధించుకోవాలని సూచించారు. ఇక పార్టీ ఆదేశిస్తే మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని సుజనా చౌదరి తెలియచేశారు. విజయవాడలో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకపోతే టీడీపీ హయాంలో ధర్మపోరాట దీక్షల పేరుతో అధర్మ దీక్షలు చేశారని తీవ్రంగా విమర్శించారు. ఇక మరోవైపు రెండేళ్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళతారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ధియోదర్ అన్నారు. ఒకపోతే ఏపీ రాజకీయాలు కొత్తమలుపు తీసుకున్నాయని, ఏపీలో వైసీపీకి బీజేపీయే ప్రత్యామ్నాయం అవుతుందన్నారు.  

Tags:    

Similar News