టీడీపీ సీనియర్ నేత, ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరణించారు. ఈ తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాత్రి రెండు గంటలకు ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు ఆయనను ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు.. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు..
2004 లో బుజ్జి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఏలూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశారు. 2014 లో టీడీపీనుంచి ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సినీ దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావుకు బడేటి బుజ్జి మేనల్లుడు వరుస అవుతారు. ఇక బడేటి బుజ్జి మృతితో టీడీపీ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయింది. ఆయన మరణం పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీకి తీరని లోటుగా మారింది.