జనసేన పార్టీ నాయకులు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని, అవినీతిపరులకు, డబ్బున్నవారికే టిక్కెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు ఆ పార్టీ మహిళా నేత దువ్వెల సృజన. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె మాట్లాడుతూ.. పోలవరం అసెంబ్లీకి జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజును ఎంపిక చేశారు. అతను పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో అవినీతికి పాల్పడ్డారని, అతనికి టిక్కెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
అలాగే జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి కష్టపడిన తనను కాదని, కరాటం సాయి అనే వ్యక్తికి టిక్కెట్ అమ్ముకున్నారని ఆమె మండిపడింది. దీనిపై తాను ప్రశ్నిస్తే టిక్కెట్ కావాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని జనసేన నేతలు అన్నట్టు ఆమె ఆరోపించారు.